ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలోకి యువ నేతలు ఇప్పుడు ఎవరూ వచ్చే అవకాశాలు కనపడటం లేదు. అయితే ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ కార్యకర్తల మీద యువ నేతల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి అవకాశం ఇస్తామని కొంతమంది జనసేన పార్టీలో ఉన్న యువ నేతలకు గాలం వేసినట్లుగా సమాచారం. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఇచ్చే సీటు కూడా వారికి హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి త్వరగా వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కాపు సామాజికవర్గ నేతలు చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా న్యాయం చేస్తారు అని జనసేన పార్టీ నేతలకు హామీలిస్తున్నారు.

రాజకీయంగా జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అవకాశం లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ లోకి వెళ్ళడానికి ఇష్టం లేని చాలా మంది నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతే కాకుండా బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు వెళ్ళడం అనవసరం గా రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నట్టే కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారట. ఇటీవల ముగ్గురు యువ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

ఏకంగా ఆయనే మాట్లాడటంతో ఇప్పుడు కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి కాస్త సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు వైసీపీలోకి కి వెళ్ళాలి అని చూసినా సరే తెలుగుదేశం పార్టీ లోకి రావాలి అని రంగం సిద్ధం చేసుకున్నారట. మరి ఈ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కొంతమందిని లోపలికి తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: