వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఓ నెల పసికందును కసాయి తల్లి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయింది. ఆ చిన్నారిని హక్కున చేర్చుకొని కొత్త బట్టలు కొని, నామకరణం కూడా చేశారు. ఈ ఘటన భాగ్యనగరం నడిబొడ్డు లో చోటు చేసుకుంది. నెలన్నర వయసు ఉన్న చిన్నారిని రోడ్డుపై వదిలి వెళ్ళిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి 11 ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ ఆ చిన్నారిని కైత్ల పూర్ వెళ్లే దారిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆ చిన్నారిని కాపాడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పెట్రోల్ మొబైల్ అక్కడకు వెళ్ళింది. పసి పాపను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. స్టేషన్ లోని మహిళా పోలీసులు ఆ చిన్నారిని శుభ్రం చేశారు. అనంతరం కొత్త బట్టలు వేశారు. అంతేకాదు ఆ చిన్నారిని కూకట్ పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి చేరదీసి ఇందిర అనే పేరును పెట్టారు. తర్వాత కూకట్ పల్లి చైల్డ్ లైన్ కు సమాచారం అందించారు. పసి పాప యోగక్షేమాలు చూసేందుకు శిశువిహార్ కి అప్పగించి పెద్ద మనసు చాటుకున్నారు..