భార్య భర్తల మధ్య గొడవలు జరగడం మామూలే. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే వారి బంధం మరింత బలపడుతుంది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న గొడవలే దారుణాలకు దారి తీస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య సరైన  అండర్స్టాండింగ్ లేకపోవడంతో.. తరచూ గొడవలు జరుగుతూ ఉండడం మనస్పర్ధలు ఏర్పడుతూ ఉండటం లాంటివి జరుగుతున్నాయి.



 మనసా వాచా కర్మణా పెళ్లి చేసుకుని వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన భార్యాభర్తలు... ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోక ఒకరిపై ఒకరికి సరైన నమ్మకం లేకపోవడంతో... పెళ్లి బంధం కొన్ని రోజుల్లోనే పెటాకులు గా మారిపోతున్న విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న గొడవలు ఏకంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్తున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది చిన్న చిన్న కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని పిల్లలను  అనాధలుగా మార్చిన ఘటనలు ఎన్నో తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యతో జరిగినది చిన్న గొడవ ఏకంగా  భర్త ఆత్మహత్య చేసుకునేంత వరకు దారి తీసింది. భర్త తీసుకున్న కఠిన నిర్ణయం  ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నింపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా మనస్థాపం చెందిన భర్త ఏకంగా ఆత్మ హత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని అమిన్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.  అమీన్పూర్ సాయిరాం కాలనీకి చెందిన రమణయ్య మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషణ  చూసుకుంటూ జీవిస్తున్నాడు.  అయితే రమణయ్య దంపతుల మధ్య తరచూ మనస్పర్ధలు తో గొడవలు జరుగుతూ ఉండేవి. ఇటీవలే మరో సారి గొడవ జరగడం తో మనస్తాపం చెందిన రమణయ్య ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: