దేశంలో రోజు రోజుకు మహిళల పై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయన్న   విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళల కు మాత్రం పూర్తిస్థాయి లో రక్షణ కల్పించలేక పోతున్నాయి.  రోజు రోజుకు సమాజం లో మానవత్వం  ఉన్న మనుషులు కరువై పోయి.. కామంతో కళ్లు మూసుకు పోతున్న మనుషులు ఎక్కువ అవుతున్న తరుణం లో రోజు రోజుకు మహిళల కు రక్షణ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు పెరిగిపోతున్న కామాంధుల కోరల్లో మహిళలు చిక్కుకోక తప్పడం లేదు.



 ఇంటి నుంచి కాలు బయట పెట్టిన ఆడపిల్ల మళ్లీ క్షేమం గా తిరిగి ఇంటికి వస్తుందా లేదా అని ప్రతిక్షణం తల్లిదండ్రులు భయాందోళనలో బ్రతికే పరిస్థితులు ప్రస్తుత సభ్య సమాజంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు దాడుల ఘటనలు  వెలుగులోకి వస్తు సంచలనం సృష్టిస్తున్న  విషయం తెలిసిందే. ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్  ఘటన గురించి మరవకముందే మరెన్నో అత్యాచార ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు మరో దారుణ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దుర్గా మాత కు పూజలు చేసి వస్తున్న యువతి పై కన్నేసిన ముగ్గురు కామాంధులు ఏకంగా యువతిని అపహరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా  జిల్లా పన్వాడి  ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవరాత్రుల సందర్భంగా దుర్గా మాతకు హారతి ఇచ్చి ఇంటికి వస్తున్న యువతిని అడ్డగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. కాగా బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: