మరో గొప్ప ఆలోచనను మోదీ ఇటీవల అమలు చేశారు .. రైతులకు అందించిన కిసాన్ ద్వారా రైతులు పంటలకు కావలసిన మందులను.. విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు.. ఇటీవల మోదీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త ను అందజేశారు. కిసాన్ కార్డులను ఉపయోగించి పాడి పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చునని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు నష్టపోరని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన మంచిదేనని మోదీ పై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవల కాలంలో మోదీ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు..ఎక్కడ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని మోదీ చెప్పారు. ఈ మేరకు అనంతపురం రైతులు టమోటాలను ఢిల్లీ వెళ్లి అమ్ముకున్నారు. కిసాన్ పేరుతో తిరుగుతున్న రైల్లో ఢిల్లీ కి రవాణా చేసి అమ్ముకున్నారు. మాములుగా రైతుల దగ్గర టమోటా 5 నుంచి పది రూపాయలు పలుకుతోంది. బయట మార్కెట్లలో 40 వరకు కిలో అమ్ముతుంది. ఈ క్రమంలో మోదీ చెప్పిన మాటలను అక్కడి రైతులు పాటించారు. అనంతపురం మొత్తం పండించిన టమోటాను ఢిల్లీ మార్కెట్లలో అమ్మారు.. దీంతో కిలో 30 రూపాయలు వచ్చింది. రైలు కాకుండా ఇతర వాహనాలలో అయితే ఎక్కువ ఖర్చు అయ్యేది.. కానీ రైల్లో వెళ్లడంతో తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభాలను ఆర్జించారు.. మరి ఈ రైలు మున్ముందు అందుబాటులో ఉంటుందా లేదా అనేది చూడాలి..