కరోనా మహమ్మారి మొదటి నుండి షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇపుడు తాజాగా ఇలాంటి వార్త మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే కరోనాతో మరణించిన ఓ వ్యక్తి తాలూక ఊపిరి తిత్తులు లెదర్‌ బాల్‌ కన్నా స్ట్రాంగ్‌గా మారినట్లు శవ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఇక వివరాలు ఇలా వున్నాయి.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 62 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి మరణించగా.. అతడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ వ్యక్తి చనిపోయిన 18 గంటల తర్వాత కూడా అతడి గొంతు, ముక్కులో నుంచి సేకరించిన స్వాబ్‌ శాంపిల్స్‌లో వైరస్‌ ఉనికిని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా శవపరీక్ష నిర్వహించిన ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందినటువంటి డాక్టర్ దినేష్ రావు మాట్లాడుతూ, రోగి యొక్క ఊపిరితిత్తులు తోలు బంతి మందంలో చాలా గట్టిగా ఉన్నాయి అని అన్నారు.

అలాగే రక్త నాళాలలో గడ్డలు కూడా ఏర్పడ్డాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ రకంగా కోవిడ్‌తో చనిపోయిన వారి శవ పరీక్ష వ్యాధి పురోగతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అని పేర్కొన్నారు. ఇక కరోనాతో మృతి చెందిన రోగి యొక్క శరీరం.. అతడి మరణం తర్వాత కూడా వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా ఉందని నివేదికలు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం నిజంగా బాధాకరం.

పరీక్షలో భాగంగా డాక్టర్‌ రావు సదరు రోగి  ముక్కు, నోరు, గొంతు, ఊపిరితిత్తుల ఉపరితలం, శ్వాసకోశ మార్గాలు, ముఖం, మెడపై చర్మం నుంచి సుమారు 5 శాంపిల్స్‌ని తీసుకోగా.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చర్మం మీద నుంచి సేకరించిన శాంపిల్స్‌ నెగిటివ్‌ వచ్చినట్లు తేలడం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో అమెరికా, ఇటలీలో శవపరీక్ష నివేదికలలో కనిపించిన ఫలితాలకు.. తాను నిర్వహించిన పరీక్ష ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు డాక్టర్‌ రావు. ఇక దీన్ని బట్టి చూస్తే.. భారతదేశంలో కనిపించే వైరస్‌ జాతులు భిన్నమైనవిగా తెలుస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: