గతవారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు...ఇప్పటివరకు ఎన్నడూ రాని వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరపున ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేదు అనుభవం ఎదురైంది. వర్షాల వాళ్ళ నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు వెళ్ళిన మంత్రిని స్ధానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలు చెప్పిన వాళ్ళకు మాత్రమే అందుతోందంటూ బాగా మండిపడ్డారు.
మంత్రి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా, ఎంతకీ వారు వినకుండా వారిస్తూనే ఉండడంతో చేసేదేమి లేక మంత్రి సబిత చివరకు పరామర్శలకు స్వస్ధిపలికి చెక్కులను కూడా పంపిణీ చేయకుండానే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇది సబితకు జరిగిన రెండో అవమానంగానే చూడాలి. ఎందుకంటే ఈమధ్యనే సబిత కాన్వాయ్ ను కూడా స్ధానికులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రజలు మంత్రి పట్ల ఈ విధంగా వ్యవహరించడం మామూలే కదా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.