మద్యం ఎన్నో కుటుంబాల్లో  తీవ్ర విషాదాన్ని నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే ఎన్నోసార్లు ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూనే ఉంటాయి. అంతే కాదు సినిమాలలో కూడా దీని గురించి చెబుతూనే ఉంటారు. కానీ ఎక్కడ మద్యానికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు  రోజు రోజుకి మద్యం తాగే వారు ఎక్కువవుతున్నారు తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. మద్యం  కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మద్యం  తాగడం కారణంగా ఆరోగ్యం విషమించి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఎవ్వరూ ఎక్కడా మద్యం తాగకుండా వుండాలి అని మాత్రం అనుకోవడం లేదు.



 దీంతో రోజు రోజుకు మందుబాబుల సంఖ్య పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. మద్యానికి బానిసైన ఎంతోమంది కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోక పోవడంతో ఎన్నో కుటుంబాలను మద్యం కారణంగా రోడ్డున పడుతున్నాయి. అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అయితే మద్యం తాగడం విషయంలో పందెం కాసి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది.



 మద్యం సరదా కాస్త ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మద్యం సరదా వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ లో చోటుచేసుకుంది. నీళ్లు కలపకుండా మద్యం తాగాలి అనే ఇద్దరు స్నేహితుల మధ్య పందెం కుదిరింది. ఈ క్రమంలోనే సాయిలు అనే 40 ఏళ్ల వ్యక్తి నీళ్లు కలపకుండా మద్యం తాగాడు.  కానీ కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్నేహితులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. సాయిలు మృతితో అతని కుటుంబం లో తీరని విషాదం నిండిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: