నాగేంద్రబాబు వైరల్ చేసిన ఫోటోలు మొత్తం మార్ఫింగ్ చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక ఇటీవలే మరోసారి దివ్య తేజస్వి కేసులో మరో కోణం బయటపడింది ఇటీవలే ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. తాను హత్య చేయలేదు అని ఇన్నాళ్ల పాటు తప్పించుకునేందుకు ప్రయత్నించిన నాగేంద్రబాబు దివ్య తేజస్వి ని దారుణంగా హింసించి హత్య చేసినట్లు ఇటీవలే ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైన నిజాలు అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పాటు గురిచేస్తున్నాయి. దీంతో దివ్య తేజస్వి కేసులో మరో కోణం బయటపడినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు తాను హత్య చేయలేదని.. తామిద్దరం ప్రేమించుకున్నామని... కానీ తన పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని భావించాము అంటూ నాగేంద్రబాబు పోలీసు విచారణలో చెప్పిన మాటలు అన్నీ అవాస్తవం అని ఇటీవలే ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దివ్య శరీరంపై బలంగా లోతుగా గాయాలు ఉన్నాయి అని ఫోరెన్సిక్ నివేదికలో గుర్తించారు నిపుణులు... అయితే ఈ గాయాలు సొంతంగా చేసుకున్నవి కావు అంటూ తెలిపారు. అలా సొంతంగా ఇంత లోతుగా గాయాలు చేసుకోవడానికి అవకాశమే లేదు అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులు వారు రెడీ చేసిన చార్జిషీట్ను కోర్టు ముందు ఉంచనున్నారు.