ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని దివ్య  హత్య కేసులో  పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ విద్యార్థి దివ్య కేసులో మొదట ప్రేమోన్మాది గా మారిన నాగేంద్రబాబు దివ్య ను  హత్య చేశారు అని అందరూ భావించారు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్న  కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడడంతో కేసు మరో కోణంలో దర్యాప్తు జరిపారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీస్ విచారణలో ఎన్నో సంచలన ట్విస్ట్ లు కూడా బయట పడ్డాయి ఇక ఆ తర్వాత ఎట్టకేలకు దివ్య ను హత్య చేసింది నాగేంద్రబాబు అని నిర్ధారించుకున్న పోలీసులు..




 నాగేంద్రబాబు వైరల్ చేసిన ఫోటోలు మొత్తం  మార్ఫింగ్ చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక ఇటీవలే మరోసారి దివ్య తేజస్వి కేసులో మరో కోణం బయటపడింది ఇటీవలే ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. తాను హత్య చేయలేదు అని ఇన్నాళ్ల పాటు తప్పించుకునేందుకు ప్రయత్నించిన నాగేంద్రబాబు దివ్య తేజస్వి ని దారుణంగా హింసించి హత్య చేసినట్లు ఇటీవలే ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైన నిజాలు  అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పాటు గురిచేస్తున్నాయి. దీంతో దివ్య తేజస్వి కేసులో మరో కోణం బయటపడినట్లు తెలుస్తోంది.



 మొన్నటి వరకు తాను హత్య చేయలేదని.. తామిద్దరం  ప్రేమించుకున్నామని... కానీ తన పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని భావించాము అంటూ నాగేంద్రబాబు పోలీసు విచారణలో చెప్పిన మాటలు అన్నీ అవాస్తవం అని ఇటీవలే ఫోరెన్సిక్ నివేదికలో తేలింది.  దివ్య  శరీరంపై బలంగా లోతుగా గాయాలు ఉన్నాయి అని ఫోరెన్సిక్ నివేదికలో గుర్తించారు నిపుణులు... అయితే ఈ గాయాలు సొంతంగా చేసుకున్నవి కావు అంటూ తెలిపారు.  అలా సొంతంగా ఇంత లోతుగా గాయాలు చేసుకోవడానికి అవకాశమే లేదు అంటూ తెలిపారు.  కాగా ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులు  వారు రెడీ చేసిన చార్జిషీట్ను కోర్టు ముందు ఉంచనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: