ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో  సంచలనంగా మారిన ఘటన 139 మంది అత్యాచారం చేసిన ఘటన..139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కాస్త వింతగా ఉండటంతో పోలీసులు ఇంట్రెస్ట్ తో కేసును నమోదు చేసుకున్నారు.అనంతరం ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఎన్నో మలుపులు, ట్విస్ట్ లు ఎదురవ్వడం తో ఈ కేసును పోలీసులు సీసీ ఎస్ కు అప్పగించారు.ఈ కేసు ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే సిసిఎస్ పోలీసులు విచారించారు.




అసలు విషయానికొస్తే... ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డాలర్ బాయ్ ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.. ఈ మేరకు అతన్ని స్పెషల్ ఇంటరాగేషన్ ను పోలీసులు చేశారు.అతన్ని ఈరోజు లేదా సోమవారం రిమాండ్ కు తరలించనున్నారు. కాగా , ఈ కేసులో మొదట సినీ రాజకీయ ప్రముఖులు పేర్లను కూడా బాధితురాలు బయట పెట్టింది.అయితే ఇదంతా తనతో డాలర్‌ భాయ్‌ చేయించాడని చెప్పి సదరు యువతి షాక్ ఇచ్చింది. తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది. తాను చెప్పినట్లు చేయకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడని సదరు యువతి పోలీసులకు చెప్పింది..




ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు డాలర్ బాయ్ ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని పోలీసులు విచారించారు. డాలర్ బాయ్ అరెస్ట్ తో ఈ కేసు లోని చిక్కు ముడి వీడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కేసు అనేది మొదటగానే వింతగా మారింది.139 మంది నా పై అత్యాచారం చేశారు..అని కాకుండా నన్ను వ్యభిచారం లోకి దించారు అంటే కేసు వేరేలా ఉండేదేమో అని సదరు అభిప్రాయపడుతున్నారు. డాలర్ బాయ్ ఎందుకు ప్రముఖల పేర్లను బయట పెట్టామన్నారు. అమ్మాయి పెట్టిందా..లేక ఇతడు స్వప్రయోజనాల కోసం పెట్టాడు.. లేదా ఇద్దరు భారీ స్కెచ్ వేసి ఇలా ప్లాన్ చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది.. మరి ఈ చిక్కుముడి వీడుతుందా లేదా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: