వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన 65 ఏళ్ల చంద్రమ్మ కొడుకు రాముడితో కలిసి నివాసముంటుంది. అయితే మద్యానికి బానిసైన కొడుకు నిత్యం డబ్బులు కావాలి అంటూ వృద్ధురాలైన తల్లిని వేధిస్తూ ఉండేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే ఉన్మాదిలా మారి పోయి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇటీవలే మరో సారి రాత్రి సమయంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలి అంటూ తల్లితో గొడవపడ్డాడు రాములు. కానీ తన దగ్గర డబ్బులు లేవు అంటూ తేల్చి చెప్పడంతో తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిపోయాడు.
ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిపోయిన కొడుకు ఏకంగా ఘాతుకానికి తెగబడ్డాడు. కొడవలితో కిరాతకంగా తల్లి గొంతుకోసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తల్లి తల మొండెం వేరు చేసి తలతో అక్కడి నుంచి పారిపోయాడు కొడుకు. అయితే చంద్రమ్మ ఎంతకీ ఉదయం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగ మొండెం మాత్రమే కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. ఇక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతురాలి కొడుకు రాములు మద్యం మత్తులో గొడవ పడుతూ ఉండేవాడని.. చుట్టుపక్కల వారిని కూడా భయాందోళనకు గురి చేసే వాడు అంటూ పోలీసులు వివరాలు తెలిపారు. ఇక నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.