వీరి అనేక విధాలుగా పరీక్ష జరిపిన తరువాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మొదట అది ఇంటర్ లూకిన్ 6 అనే ప్రోటీన్ చర్యను అడ్డుకుంటుందని భావించారు. తద్వారా ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు దోహదం చేస్తుందని అనుకున్నారు. ఈ క్రమంలో, అది కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గిస్తుందని భావించారు. ఈ క్రమంలో దీనిపై 4 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
అందులో భాగంగానే అది మరణాల సంఖ్యను ఎంత మాత్రం తగ్గించడం లేదని తేల్చారు. ఈ వివరాలను పరిశోధకులు అక్టోబర్ 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించగా ఈ విషయం తేటతెల్లం అయింది. ఈ సందర్భంగా వారు కరొనను లైట్ తీసుకోవద్దని ప్రపంచ ప్రజలకు మనవి చేసారు. యధావిధిగా మాస్కు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని సూచించారు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను పరిశోధకులు అక్టోబర్ 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించారు.