బీహార్లో అధికార బీజేపీ - జేడీయూ కూటమి మీద తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. ఒకవేళ తాము కూడా బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ తరహాలో తప్పుడు హామీలు ఇవ్వాలనుకుంటే 50 లక్షలు లేకపోతే కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించేవారిమని తేజస్వి యాదవ్ అన్నారు. ‘ఉపాధి చూపించడానికి, ఉద్యోగం చూపించడానికి మధ్య చాలా తేడా ఉంది. చెత్త కాగితాలు ఏరుకునే వాడికి కూడా ఉపాధి ఉన్నట్టే. కానీ, మేం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై సంతకం పెడతాం.
హెల్త్ కేర్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్, మొదలైన వాటిలో 4.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 7 శాతం జూనియర్ ఇంజినీర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.’ అని తేజస్వి యాదవ్ అన్నారు. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టో లో తప్పుడు హామీలతో తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం బీహార్ ప్రజలు వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే మన బిహారల్ తో చాలా ఆడుకున్నారు ఇక ఆటలు సాగనివ్వకుండా ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటున్నాను అని అన్నారు.