నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పండుగ వేళ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. పన్ను చెల్లింపుదారులకు ఒక విధంగా ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది అని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం లేదా 2020-21 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఇది వర్తిస్తుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మోదీ సర్కార్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ను డిసెంబర్ 31లోపు దాఖలు చేయొచ్చు అనే నిర్ణయం తీసుకుంది.


ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డెడ్‌లైన్ పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలా డెడ్‌లైన్ పలుమార్లు పొడిగించింది. సాధారణంగా మార్చి 31తో ఐటీఆర్ దాఖలు గడువు ముగుస్తుంది. కానీ ఈసారి కోవిడ్ 19 కారణంగా ఇలా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ గడువును మే వరకు పొడిగించింది. తర్వాత ఈ గడువు మరలా నవంబర్ 30 వరకు ఎక్స్‌టెండ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ డిసెంబర్ చివరకు డెడ్‌లైన్ పొడిగించింది ఆదాయ పన్ను శాఖ. పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలుకు ఎక్కువ గడువు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. అలాగే అకౌంట్లను ఆడిట్ చేసుకోవలసిన వారికి ఐటీఆర్ దాఖలు గడువును జనవరి 31 వరకు పొడిగించింది. ఈవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ దాఖలు గడువును పొడిగించడం చాలా మందికి ఊరట కలుగుతుంది. ఐటీఆర్‌కు ఎక్కువ గడువు లభించడంతో ఇంకా మిగిలిన వారు కూడా రిటర్న్స్ దాఖలు చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: