ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే.  రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే అటు  పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దొంగలు ఎంతో వినూత్నంగా ఆలోచిస్తూ ఎక్కడ ఎలాంటి ఆధారాలు లభించకుండా దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దొంగలు పట్టుకోవడం పోలీసులుకు పెద్ద సవాలుగా మారిపోతుంది. ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న దొంగతనాలు పోలీసులకు తలనొప్పి గా మారిపోతున్న విషయం తెలిసిందే.



 సాధారణంగా అయితే కొన్ని ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి చుట్టుపక్కల ఇళ్లల్లో ఏ ఇంటికైనా తాళం కనిపించింది అంటే చాలు దొంగలు రెచ్చిపోతుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఎంతో పక్కాగా  ప్లాన్ వేసి ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు నగదు నగలు అన్నీ దోచుకు పోతూ ఉంటారు తర్వాత ఇంటికి వచ్చిన యజమానులకు షాక్ తగులుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ పండుగ సీజన్లో ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న తరుణంలో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు.


 తాళం వేసి ఉన్న ఇల్లు లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు దొంగలు. ఇటీవలే ఒకే రోజులో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. కేవలం తులసి నగర్ లో నే ఒక్క రాత్రిలో 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. కాలనీకి 4 ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు పండుగ నిమిత్తం సొంతూర్లకి వెళ్లారు. దీంతో ఇదే అవకాశంగా తీసుకున్న దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఆ ఇంటి తాళాలు పగల కొట్టి ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకు  పోయారు. కేవలం నగదు నగలు మాత్రమే కాదు ద్విచక్ర వాహనాన్ని కూడా ఎత్తుకెళ్ళడం గమనార్హం. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: