గత ఎన్నికలనుంచి రిటర్న్ గిఫ్ట్ అనే మాట చాలా ఫేమస్ అయ్యింది.. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేసి గెలకడంతో కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో వేలుపెట్టి చంద్రబాబు ను ఓడించాడు.. దాంతో కేసీఆర్ ప్రచారంలో చెప్పిన రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు కు ఓటమి రూపంలో ఇచ్చాడు.. ఇక జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి రాష్ట్రం లోని ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో తెలిసిన సంగతే.. జగన్ తన పాలనలో సంక్షేమ పథకాలకు ఎక్కువ విలువనిస్తూ బడ్జెట్ లో ఎక్కువ శాతం ఈ స్కీం లకు ఉపయోగించడంతో ప్రజలకు పథకాలు నేరుగా అందుతుండడంతో జగన్ కి ప్రజల్లో రోజు రోజు కి పాపులారిటీ పెరిగిపోతుంది..

ఇప్పటికే అయన చేసిన రివ్యూ లో కూడా మంచి ఫలితాలు వచ్చాయని అయన డైరెక్ట్ గ ప్రజలకే చూపించారు.. ఇక ప్రతిపక్షాలు ఎలా ఉన్నా జగన్ మాత్రం తన మార్క్ పాలనను చూపిస్తూ ఇప్పటిలో తన ని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేకుండా చేస్తున్నారు.. ఇక అవినీతి విషయంలో కూడా జగన్ ఎక్కడ తగ్గట్లేదు.. ఇప్పటికే కొంతమంది ని జైలుకి పంపినజగన్ టార్గెట్ చంద్రబాబు ఫై పెట్టారు..

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి-అక్రమాలపై ఇప్పటికే ప్రధాని మోడీకి వివరించారు ముఖ్యమంత్రి జగన్. దీనిపై తయారుచేసిన పూర్తి నోట్ ను ప్రధానికి అందించినట్టు సమాచారం. ఇక పోలవరం లెక్కల్లో అవకతవకల్ని ఇప్పటికే పూర్తిస్థాయిలో కూపీలాగిన ఆర్థిక మంత్రి బుగ్గన కూడా..తాజాగా దీనికి సంబంధించిన అవకతవకల వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అందించినట్టు తెలుస్తోంది. మరోవైపు స్వయంగా ప్రధాని మోడీ గతంలో పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం గమనార్హం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని స్వయంగా ప్రధాని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీర్ రిటర్న్ గిఫ్ట్ కంటే పెద్ద రిటర్న్ గిఫ్ట్ జగన్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: