దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఏర్పాటయ్య వరకూ అమ్మవారికి నిత్యం వన్టౌన్ పోలీసులే పూజలు చేసే వాళ్లు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ ఉగ్రరూపంలో ఉండే వారు. కాళికా రూపంలో భయంగొలిపేలా ఉండడం వల్ల భక్తులు తనను చూసి భయపడకుండా కొండ దిగేవారు కాదు అమ్మవారు. అయితే, ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతింపజేసి... శాంతి దుర్గమ్మగా మార్చారని చెబుతారు. అంతేకాదు... అమ్మవారిని అష్టదిగ్బంధం చేయడానికి వేసిన సిరి చక్రం కూడా ఇంద్రకీలాద్రిపై ఉంది. కళియుగంలో భక్తులు నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తారు కానీ... నువ్వు కిందకు దిగాల్సిన అవసరం లేదని ఆదిశంకరాచార్యులు అమ్మవారికి విన్నవించినట్టు పలు శాసనాలను బట్టి తెలుస్తోంది.
కాలక్రమంలో కనుమరుగైపోయిన అమ్మవారి గురించి సైనికుడైన మంగయ్య వల్ల అందరికీ తెలిసింది. ఒకప్పుడు గ్రామానికి కాపలాకాసిన సైనికుడి స్థానంలో పోలీస్ వ్యవస్థ రావడంతో... అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పోలీసులకు భాగస్వామ్యం లభించింది. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మొత్తానికి మంగయ్య ఇల్లే పోలీస్ స్టేషన్ కావడం విశేషం.