రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తనను ఈ తరహాలో సమావేశానికి రావాల్సిందిగా ఎలా మెసేజ్ ఇస్తారంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ మండిపడ్డారు. తనకు మెసేజ్ ఇచ్చిన సీఎంవో ముఖ్య కార్యదర్శికి.. తన పేషీ నుంచి రిప్లై ఇప్పించారు. హైకోర్టు జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆ మెసేజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. దీంతో ఈ మెసేజ్ ఎస్ఈసీ సెక్రటరీకి పంపబోయి పొరపాటున ఎస్ఈసీకి పంపామన్న విషయాన్ని ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు. అయినా వెనక్కి తగ్గని నిమ్మగడ్డ తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహాణ విషయమై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.
అసలే సీఎంఓకు.. ఎస్ఈసీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వివాదం సరికొత్త డిస్కషన్కు తెర తీసింది. ఎస్ఈసీ చెప్పినట్టు ఈ వ్యవహరాన్ని కోర్టు దాకా తీసుకెళ్తారా..? లేదా అనేది హాట్టాపిక్ గా మారింది.