కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.... అందరూ మాస్కులు తప్పనిసరిగా వాడుతున్నారు.... ఈ నేపధ్యంలో ఖాదీ వస్త్రాలతో చేసిన మాస్కులకు బాగా డిమాండ్ పెరుగుతోందన్నారు. అంతేకాకుండా ఇవే ఇప్పుడు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి అని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ప్రతిరోజు వేలాది ఖద్దర్ మాస్కులను తయారు చేస్తున్నట్లు మోడి తెలిపారు. అంతేకాదు స్వయం ఉపాధి నిర్మించుకున్న మహిళలను ప్రతిభావంతులను మెచ్చుకున్నారు. ఇక అమెరికాలోని చిన్మయ్ పాఠంకర్ మల్లయోధులను తయారు చేస్తున్న విషయాన్ని మోడి ప్రస్తావించారు. భారత్ తరహా మల్లయుద్ధంపై అమెరికాలోని యువత ఆసక్తి చూపటం పట్ల ఆయన ఎంతగానో సంతోష పడుతున్నట్లు తెలిపారు. భారతీయులు విస్మరించిన మల్లయుద్ధమును అమెరికా యువత నేర్చుకోవటం మనకు గర్వకారణం అంటూ పొగిడారు.
ఇలా పది అంశాల గురించి మాట్లాడిన ప్రధానమంత్రి తమిళనాడుకు చెందిన తిరువక్కురళ్ గురించి ప్రస్తావిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరూ తిరువక్కురళ్ ను చదవాలని సూచించారు... కానీ ఇక్కడ సామాన్యుడికి అర్థమయ్యేలా అసలు..... తిరువక్కురళ్ అంటే ఏమిటి ? తమిళనాడుకు చెందిన దీనిని దేశంలోని మిగితా ప్రాంతాల వాళ్ళు ఎందుకు చదవాలో మాత్రం మోడి చెప్పకపోవడం గమనార్హం. చివరగా దసరా పర్వదిన గురించి మాట్లాడుతూ.... మొదట పండుగ ప్రాముఖ్యత గురించి మాట్లాడిన మోడీ ఆ తర్వాత పండగ పూట బయటకు వెళ్లలేని పరిస్థితిలో మనము ఉండటం బాధాకరమని అన్నారు. ఇలా మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ పలు అంశాలను మాట్లాడినప్పటికీ... ఖద్దరు వస్త్రాల ప్రస్తావన హైలెట్ గా నిలిచింది.