ఆనాటి, నేటి ప్రభుత్వాలు కనీసం రోడ్ కు స్థలం ఇవ్వలేదన్నారు. రాజధాని విషయం లో టిడిపి, వైసిపి లే ప్రజలను మోసం చేశాయని, హైకోర్టు రాయలసీమ లో ఉండాలని బిజెపి విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. చంద్రబాబు రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసారు. జగన్ ప్రభుత్వం కూడా గొప్పలు చెప్పుకోవడం తప్ప.. చేతల్లో చూపించడం లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టు లను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
గడ్కరీ.. స్వయంగా చంద్రబాబు ను విశాఖ పిలిపించి నిధుల పై చర్చించారని గుర్తు చేసారు. అన్ని పార్టీ ల జాతకాలు చెప్పే లగడపాటి రాజగోపాల్.. రెండేళ్ళ ఎంపిగా దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయలేక పోయారన్నారు. కేశినేని నాని ఒక. లేఖ ఇవ్వగానే గడ్కరీ స్పందించి ఫ్లైఓవర్లకు నిధులు ఇచ్చి పూర్తి చేశారని ఆయన తెలిపారు. టిటిడి నుంచి డిపాజిట్ సొమ్మలు తీయవద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశాం అని ఆయన అన్నారు. వరదల పై పరిశీలించి.. సాయం చేయాలని లేఖ రాస్తే కేంద్రం వెంటనే స్పందించిందని ఆయన పేర్కొన్నారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. రాష్ట్ర అభివృద్ధి కే మా ప్రాధాన్యత అని సోము స్పష్టం చేసారు.