ఈ నేపధ్యంలో జియ గూడా లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పెద్దలు ఇల్లు కట్టి చూడు , పెళ్లి చేసి చూడు అంటారని, ఆ రెండు కష్టమే అని అర్థం అని ఆయన వ్యాఖ్యానించారు. పేదల కల సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. పేద ఇంటి ఆడ బిడ్డ పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని, ఇప్పుడు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నారని ఆయన చెప్పారు. 560 స్క్వేర్ ఫీట్ తో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 18 వేల కోట్ల రూపాయల తో 2 లక్షల 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సగం రెడీ గా ఉన్నాయని మంత్రి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ పంపిణీ విషయంలో టిఆర్ఎస్ నేతలు ఎవరూ జోక్యం చేసుకోరని స్పష్టం చేసారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడే దళారులను ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఇళ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. గ్రేటర్ హైద్రాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను దశల వారిగా ఇస్తామని ఆయన అన్నారు. జియా గూడ లో కబేలా కడతామని అన్నారు.