ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రీయల్ పాలసీని సిఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం అని అన్నారు. ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని ఆయన అన్నారు. ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో రూ. 1 కోటి రూపాయిలు కూడా ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం అన్నారు. ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం అన్నారు.  

వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాలను చేపడుతున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం అని అయన వివరించారు. 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూముల కేటాయింపులు చేస్తామని అన్నారు. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు ఇస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు చేపట్టామని ఆయన అన్నారు.

 సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయని ఆయన తెలిపారు. పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నాం అని ఆయన తెలిపారు. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం అని ఆయన తెలిపారు.  ఎస్సీ, ఎస్టీలకు  చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? అనే దానిపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలో సిఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: