పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే లుధియానా లోని తిబ్బా రోడ్డు ప్రాంతంలో ఓ గిడ్డంగులో ఒక వివాహిత గత కొంత కాలం గా పనిచేస్తోంది. అయితే ఆ వివాహిత కూతురు అయిన ఓ మైనర్ బాలిక తరచూ అదే గిడ్డంగి వచ్చి వెళ్తుండేది. ఒకరోజు ఆ వివాహిత తీవ్ర అనారోగ్యం పాలయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో 15 ఏళ్ల మైనర్ బాలిక గిడ్డంగి పనులకు వెళ్లాల్సి వచ్చింది. అక్టోబర్ 19వ తేదీన ఆమె పని ప్రాంతానికి వెళ్లినప్పుడు.. అక్కడ యజమాని అయిన మహమ్మద్ ముక్తాఫర్ బాలిక పై కన్నేశాడు. ఆ ముక్కుపచ్చలారని బాలికపై తన కామ వాంఛ తీర్చుకోవాలకున్నాడు.


అందుకే ముందస్తుగా ఒక పన్నాగం పన్నాడు. అందులో భాగంగానే ఒకరోజు డ్యూటీ అయిపోయిన తర్వాత బాలికను అనుసరించాడు. ఇంటిదగ్గర దింపుతాం అని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మాస్కు ధరించకపోతే కరోనా వైరస్ సోకుతుందని మాస్కు కచ్చితంగా ధరించాలని ఆ బాలికకు చెప్పి ఒక మాస్క్ ఇచ్చాడు. అయితే ఆ బాలిక మాస్కు ధరించగానే స్పృహతప్పి పడిపోయింది. ఎందుకంటే ఆ మాస్క్ లో మత్తుమందు చల్లాడు ఆ కామాంధుడు. బాలిక ఉలుకు పలుకు లేకుండా కారులోనే కింద పడటంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు మహమ్మద్. అయితే ఈ విషయం కాస్త బాలిక తల్లి కి తెలిసింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి మహమ్మద్ పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని అక్కడి స్థానిక ప్రజలు నిరసనలు చేస్తున్నారు.


ఏది ఏమైనా భారత దేశంలో మహిళలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. బాగా తెలిసిన వారే బాలికల మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ మగ పురుగు నమ్మకుండా.. చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: