పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో 15 మంది మగ కామాంధులు పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా కూడా ఇద్దరి టీనేజీ అమ్మాయిలను అపహరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్టు లాహోర్ పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 23 వ తేదీన నిందితులపై కేసు నమోదు కాగా... బాలికలపై సెప్టెంబర్ 16వ తేదీన ఫైసలాబాద్ లో అత్యాచారం జరిగింది. లాహోర్ సిటీ కి 130 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.


అయితే తమ ఇద్దరు కూతుర్లపై 15 మంది లైంగిక దాడికి పాల్పడ్డారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాకిస్తాన్ చట్టాల ప్రకారం సంబంధిత కేసుల కింద నిందితులను బుక్ చేశారు.


పోలీసుల కథనం ప్రకారం... సల్మాన్, అలీ రాజా, జానీ అక్మల్, వకాస్, ఫైజీ తో పాటు మరో పది మంది కలిసి ఫైసలాబాద్‌లోని మార్కెట్‌కు వెళ్తుండగా 17, 15 ఏళ్ల ఇద్దరు అక్క చెల్లెలను చూసి వారిపై కన్నేశారు. వారిని అనుసరించి చివరికి అపహరించారు. నిందితులు ఓ నగరంలోని ఒక హోటల్ లో చాలా రోజుల పాటు ఉండి.. డ్రగ్స్ వాడి తర్వాత బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దుర్మార్గులు బాలికల యొక్క న్యూడ్ ఫోటోలను తీశారు. అలాగే వారి అశ్లీల వీడియోలు కూడా రికార్డ్ చేశారు.  కొన్ని రోజుల పాటు ఇద్దరు టీనేజ్ బాలికలపై గ్యాంగ్ రేప్ చేసిన తరువాత అక్టోబర్ 2న రెండు బృందాలుగా ఏర్పడి ఏమీ జరగనట్టుగా తప్పించుకున్నారు.


అయితే బాలికలు ఇంటికి వచ్చి తమకు జరిగిన ఘాతుకం గురించి చెప్పి ఏడ్చారు. నిందితుల్లో ప్రధాన వ్యక్తి అయిన అలీ 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో వారిపై కక్ష కట్టిన ఆ వ్యక్తి పక్కా ప్లాన్ ప్రకారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి దానికి పాల్పడ్డాడు. అలాగే బాలికల నుండి 80 వేల పాకిస్తాన్ రూపాయలను దొంగలించాడు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: