మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.  హర్యానాలో జరిగిన దారుణ ఘటన మహిళల భద్రతను సవాల్ చేస్తోంది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఒక యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపాడో దుర్మార్గుడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది.

యువతి  పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి  అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి.  ఈ దారుణ హత్యకు సంబంధించిన  వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నిఖిత పరీక్ష రాసి ఇంటికి బయలు దేరింది. పరీక్ష రాసి బయటికి వస్తుండగా బాధితురాలి స్నేహితుడుగా భావిస్తున్న తౌసీఫ్ ఎటాక్ చేశాడు. మొదట కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. నిందితుడు తౌసీఫ్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేసింది.

ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఫరీదాబాద్‌లో భారీ ఆగ్రహం చెలరేగింది. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. దీంతో భారీ ట్రాఫిక్‌ జాం అయింది. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ నినాదాలు చేశారు.

మొత్తానికి హర్యానాలో ఘోరం జరిగిపోయింది. కేవలం మతం మారేందుకు ఒప్పుకోలేదన్న ఒకేఒక్క కారణంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఓ దుర్మార్గుడి తూటాలకు  బలైపోయింది. దీనిపై ఇపుడు ఆ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: