ప్రస్తుత రోజుల్లో పెళ్లి అయిన కొద్ది రోజులకే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో విడాకుల పేరిట దంపతులు విడిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కోయంబత్తూరులో జరిగింది. వివరాలిలా వున్నాయి.. తమిళనాడులోని కోయంబత్తూరులోని నాగ గణేష్ అనే భారీ నగల వ్యాపారితో కోయంబత్తూరులో జ్యువెలరీ షాపులు నిర్వహిస్తున్న తిళగరాజన్ కుమార్తె అయినటువంటి ఐశ్వర్యతో 2013లో రంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.

వీరికి రాజేంద్రన్ అనే 7 సంవత్సరాల కుమారుడు వున్నాడు. ఆ తరువాత కాలంలో భార్యాభర్తలు ఇద్దరికీ మధ్య వివాదాలు తలెత్తాయి. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఐశ్వర్యకు మదం పెరగడంతో భర్త మాటలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేది. భర్త ఎంత చెప్పినా నా ఇష్టం అంటూ ప్రవర్తించేది. అలా వారి గొడవలు చినికి చినికి గాలివానగా మారడంతో 2016 నుంచి నాగ గణేష్ - ఐశ్వర్య దంపతులు వేరువేరుగా ఉంటున్నారు.

అందువలన వీరు విడాకులు తీసుకోవాలని కోయంబత్తూరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తనకు విడాకులు ఇస్తే ఐశ్వర్యకు రూ. 65 లక్షల నగదు ఇస్తానని నాగ గణేష్ అంగీకరించాడు. ఐశ్వర్య అందుకు అంగీకరించింది. ఈ తంతంతా న్యాయవాదుల సమక్షంలోనే జరిగింది. ఇక కొడుకు రాజేంద్రన్ తండ్రి నాగ గణేష్ దగ్గర ఉండటానికి ఐశ్వర్య అంగీకరించింది. ఇకపోతే, కరోనా కారణంగా విడాకుల డీల్ పత్రాలు కోర్టులో సమర్పించడానికి ఆలస్యం అయ్యింది.

ఈ నేపథ్యంలో డీల్ లో మాట్లాడుకునట్టుగా.. రూ.65 లక్షలు ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. దీనితో ఐశ్వర్య సుపారీ ఇచ్చి ముగ్గురు కిరాయి హంతకులను రంగంలోకి దించింది. అనుకున్నదే తడువుగా భర్త నాగ గణేష్ దగ్గర వున్న కన్న కొడుకు రాజేంద్రన్ ను కిడ్నాప్ చెయ్యడానికి స్కెచ్ వేసింది. వ్యవహారం కాస్త పోలీసులకు తెలియడంతో, కథ పూర్తిగా అడ్డం తిరుగుతుంది అని భావించి ఆ క్రిమినల్స్ తో పాటుగా పారిపోయింది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: