ఒక్కో రైతుకు రూ 77వేల పైగా ఎగ్గొట్టి మీడియాలో గొప్పగా యాడ్స్ ఇవ్వడం వైసిపి నమ్మక ద్రోహం కాదన్నారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ 4వేలకోట్లు ఇస్తామని రైతులను నమ్మించారని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారన్నారు. ఇప్పుడు రూ 500 ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సుఫ్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా? అని ఆయన నిలదీశారు.
అసలే అక్రమ కేసులు. ఆపై మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి మానవ హక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాలి అని ఆయన స్పష్టం చేసారు. కృష్ణాయపాళెం దళిత, బిసి, తదితర రైతులపై ఎస్సీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదని ఫిర్యాదుదారుడైన ఈపూరు రవి పోలీసులను కోరారు అని, తాను పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోమని పోలీసులకు విజ్ఞప్తి చేశారన్నారు. అయినా పోలీసులు తమ అక్రమ కేసులను సరిచేసుకోకపోగా అన్నదాతలకు సంకెళ్లు వేయడం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. రైతు విద్రోహ చర్య అవుతుందని ఆయన పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా పోలీసు చర్య ఉన్నదన్నారు.