కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనాపై పోరాటమే లక్ష్యంగా అక్టోబర్ 8న ప్రధాని మోదీ ‘జన్ ఆందోళన్’ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని హోంశాఖ విజ్ఞప్తి చేసింది. మాస్క్లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం, కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరింది. ఎవరూ కూడా అనవసరంగా బయట తిరగవద్దని అలాగే చిన్న పిల్లలు, వృద్ధుల విషయమై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలా అన్ని రకాల సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనాపై పోరాటమే లక్ష్యంగా అక్టోబర్ 8న ప్రధాని మోదీ ‘జన్ ఆందోళన్’ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని హోంశాఖ విజ్ఞప్తి చేసింది. మాస్క్లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం, కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరింది. ఎవరూ కూడా అనవసరంగా బయట తిరగవద్దని అలాగే చిన్న పిల్లలు, వృద్ధుల విషయమై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలా అన్ని రకాల సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది