ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 29 మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ ధరణి పోర్టల్‌ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్‌ సీఎం కేసీఆర్‌ చేతుల మీదగా ప్రారంభం కానుంది.

సమీకృత భూ రికార్డ్‌ల యాజమాన్య విధానం ధరణిని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. భూ రికార్డ్‌లన్నింటిని ఆన్ లైన్ లోకి మార్చుతోంది. భూ పరిపాలన, రిజిస్ట్రేషన్ సేవలు రెండింటిని అనుసంధానం చేసే అధునాతన భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థని రూపొందిస్తుంది.

ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారయింది. ఈ నెల 29న రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాడానికి అధికారులు సిద్ధమయ్యారు. ధరణి పోర్టల్ పై రెవెన్యూ అధికారులకు శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు ఒక టీం వర్క్ లాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌.

ధరణి పోర్టల్ పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్లాట్ బుకింగ్ , సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్‌పై వివరించారు. ధరణి టెక్నికల్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లాస్థాయి టెక్నికల్ సపోర్ట్ టీంలు పనిచేయనున్నాయి. ధరణి అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశించారు.

మొత్తానికి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్ 27వ తేదీ మధ్యాహ్నం 12.30గంటలకు రంగారెడ్డి వేదికగా ప్రారంభం కానుంది. స్వయంగా ముఖ్యమంత్రి  ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు.
అందులో భాగంగానే ధరణి పోర్టల్ పై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు.








మరింత సమాచారం తెలుసుకోండి: