తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కథల ఎంపికలో ఆచి  తూచి అడుగులు వేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస  బ్లాక్ బస్టర్ విజయాలని  తన ఖాతాలో వేసుకుంటు  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.



 ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట అనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఎంతో డిఫరెంట్గా ఉండబోతుంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా  ఇటీవలే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ అందరిలో మరింత ఆసక్తిని పెంచింది. మహేష్ బాబు మెడపై ఒక రూపాయి నాణెం పచ్చబొట్టు ఉండటం  ఆసక్తికరంగా మారిపోయింది.



 ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. గీత గోవిందం  సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో చిన్న మార్పు జరిగినట్లు తెలుస్తోంది.  జనవరి నెలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అమెరికాలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ లో అమెరికాలో షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.  కానీ ప్రస్తుతం ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా అమెరికాలో జనవరిలో షూటింగ్ జరుపాలని భావిస్తుందట చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా... విద్యాబాలన్ అరవిందస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: