సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. పెళ్లి చేసుకొని సంతోషంగా జీవనం కొనసాగించకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రియుల మోజులో పడి భర్తలను భార్యలు మట్టుబెడుతున్న వైనం ఆందోళనకరంగానే ఉంది. ఆవేశంలోనో, ఉద్రేకంలో జరుగుతున్న హత్యలు కూడా కావు. ప్రియులను, వారి స్నేహితులను సాయంగా తీసుకుని భార్యలు పక్కా పథకం ప్రకారం హత్య చేస్తున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న వారిని చంపుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి సంఘటన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెంకణికోటకు చెందిన ప్రేమ, మాదేశ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. మాదేశ్‌ టైలర్‌గా, ప్రేమ ఓ గార్మెంట్స్‌లో పనికి వెళ్లేది. ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రేమ ఇంటి వద్దే ఉండేది. ఈ సమయంలో ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజులకు ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని పారిపోవాలనుకున్నారు. అయితే ఇందుకు తన భర్త మాదేశ్ అడ్డుగా ఉన్నాడని ప్రేమ భావించింది. దీంతో అతడిని చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.

ఈ క్రమంలో ఈ నెల 17 తేదీ రాత్రి మాదేశ్‌ను తీవ్రంగా కొట్టారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రేమ, శివమల్లు ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. అలాగే వీరికి సహకరించిన మల్లేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: