అనాడు అనేక చోట్ల బిజెపి కార్యకర్తల మీద, ఇతర ప్రతిపక్ష పార్టీల మీద నామినేషన్ దాఖలు చేయకుండా వైసిపి దాడి చేసింది అని ఆయన ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేయకుండా దాడి అధికార వైసీపీ వారు చేశారని అనాడు ఇదే ఎన్నికల కమిషన్ కు బిజెపి ఫిర్యాదు చేసినా నోరు మెదపలేదు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు అని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా జరగలేదు అనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి? అని ఆయన నిలదీశారు. ఎన్నికల కమిషన్ నేడైనా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు.
కాగా నేడు అఖిలపక్ష సమావేశం ఏపీ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయం చెప్పాలి అని ఎన్నికల సంఘం కోరుతుంది. అయితే జనసేన, బిజెపి మాత్రం ఈ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండటం తో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.