ఇలాంటి ఘటనలు మన భారతదేశంలో జరగడం అత్యంత అమానుషం.. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి.. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అదేంటంటే ఒకటి సోషల్ మీడియా లో అసభ్య పోస్టు లు చూడటం.. మరొకటి సినిమాలను ఎక్కువగా చూడటం .. ఈ సినిమా వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే.. డబ్బులు వస్తాయి చాల్లే అంటూ బీప్ సినిమాలను జనాలకు చూపిస్తున్నారు. వాటి వల్ల యువత ఎంతగా చెడిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు..
ఇటీవల కాలంలో వావి వరుసలు కూడా మర్చిపోయి చాలా మంది ప్రవర్తిస్తున్నారు.. కామాంధుల పిచ్చి పరాకాష్టకు చేరుతుంది. ముఖ్యంగా అమ్మాయిల మనుగడ అనేది కొద్ది రోజులు పోతే భూమ్మీద ఉండదేమో అన్నట్లు కొనసాగుతుంది. ముఖ్యంగా మైనర్ బాలురులు చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల మెడ్ పల్లి లో పదనాలుగు ఏళ్ల బాలిక పై నలుగురు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. టెక్నాలజీ వల్ల వీడియోలు తీసి బెదిరిస్తున్నారు.. ఇలాంటి విషయాలను తల్లి దండ్రులు పరిగణలోకి తీసుకోవాలి.. లేకుంటే సమాజం లో ఆడవాళ్ళు అనే వాళ్ళు ఉండరు..పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడంతో పాటుగా మంచి నడవడికను కూడా అలవాటు చేయాలి లేకుంటే సమాజంలో ఇలాంటి ఘటనలు పరాకాష్టకు చేరుతాయి .