దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్ లో బీజేపీ ఎంపీ అరవింద్  ప్రచారం నిర్వహించారు. జోయల్ డేవిస్ వినబడేలా జై శ్రీరామ్ అనండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.  ఇది హిందు రాష్ట్రం  డేవీస్ గుర్తు పెట్టుకో అంటూ ఆయన సవాల్ చేసారు. ఈ బీజేపీ సభకు కొందరు టీఆర్ఎస్ వాళ్లు కూడా వచ్చారు  అని, ఎందుకూ ఇదీ హిందూ దేశం కాబట్టి అని ఆయన అన్నారు. రాజ్యాంగంలో సెక్యూలరిజం ఉంది కాబట్టి మనం కూడా పాటించాలి అని అన్నారు.

పోలీసులు గుర్తుంచుకోవాలి.. నేను ఎంపీ గా గెలిచాక మూడు నాలుగు సార్లు రాజ్యంగంలో సవరణలు చేశామన్నారు. అంటే ఒక ఎంపీ అంటే ఏమిటో తెలుసుకోవాలన్నారు. హరీష్ రావుది కోడి మెడ.. రఘన్నా జరా మెల్లిగా ఇరవండన్నారు. హరీష్ కు అప్పుడు పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టె దొరకలేదు.. ఇప్పుడు రాజీనామా చేయడానికి పేపరు దొరకడం లేదు అన్నారు. బీసీ బిడ్డ సంజయ్ ముక్కు నేలకు రాయలట... మరీ హరీష్ మీ మామ ముక్కు కూడా పెద్దగా ఉంటది మీరెందుకు ముక్కు నేలకు రాయరు అని ఆయన కామెంట్స్ చేసారు.

హరీష్ కేసీఆర్ దగ్గర ఒక గుమస్తా... ఆర్థిక మంత్రి కాదన్నారు. మామను చూసి పైసలు సంపాదించి అందరిని కొనడమే హరీష్ పని  అన్నారు. కేసీఆర్ ఒక లఫంగ... రైతులు ధర్నాలు చేయగానే మక్కలు కొంటామన్నాడు.. రైతులందరు మక్క అమ్మాక కొనుగోలు కేంద్రాలు పెడుతరట అని ఆయన విమర్శించారు. దగుల్బాజి కేసీఆర్ కు డప్పులు  కొట్టుకుంటూ కేటీఆర్, హరీష్ రావులు తిరుగతరు అని ఆయన విమర్శించారు. హరీష్ రావు చిల్లర పైసల మనిషి   అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

2009 వరకు కేటీఆర్ ఎవరికీ తెలియదు... మొన్నటి వరకు సంతోష్ రావు ఎవరో తెలియదన్నారు. వరి ధాన్యం నూటికి నూరు శాతం కేంద్రమే కొంటది... రాష్ట్రానికి సంబంధమే లేదని ఆయన తెలిపారు. హరీష్ రావు ఛాలెంజ్ ఎక్కువగా చేస్తున్నావు... మాతో ఛాలెంజ్ లు చేయకు..  జరాసంధుడిని చించినట్టు చించుతా అని ఆయన హెచ్చరించారు. హరీష్ రావు నువ్వు బండి సంజయ్ ని ఓరేయ్ అంటావా.. నువ్వెంత హరీష్  అని ఆయన ప్రశ్నించారు. సీఎంకు మర్యాద తెలియదు.. మమ్మల్ని తిడతడు, సోనియాను తిడుతాడు, ఆంధ్రోళ్లను తిడుతాడు అని, రాష్ట్రానికి తండ్రి లాంటోడు సీఎం.. మరి ఆయనే అలా తిడుతే మేము తిట్టమా అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: