ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంత కాలంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తూ ఆయన లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు... అందులో సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో 30 వేల మంది చర్చి ఫాస్టర్లకు నెలకు రు.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారికంగా జిఓ విడుదల చేసింది అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈ చర్య... రాష్ట్రంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదలకు దోహదపడుతుంది అని ఆయన ఆరోపించారు. ప్రజల డబ్బును క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగించడం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే అని ఆయన పేర్కొన్నారు. 2011లో 1.8 శాతం ఉన్న క్రిస్టియన్ జనాభా... ఇప్పుడు 25 శాతం వరకు మత మార్పిడి ద్వారా పెరిగింది అని ఆయన ఆరోపించారు. కానీ, ఇది అధికారికంగా ప్రభుత్వ రికార్డులోకి రావడం లేదు అని ఆయన మండిపడ్డారు. ఇలా మారిన వాళ్ళు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి.. చట్ట సభలకు కూడా వస్తున్నారు అని ఆయన అసహనం వ్యక్తం చేసారు.

మరికొంతమంది విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కూడా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సరి సమానంగా చర్చిలు ఏర్పాటు అయ్యాయి అని ఆయన అసహనం వ్యక్తం చేసారు. సుమారు 33 వేల చర్చిలు ఏర్పాటు అయినట్లు సమాచారం అని ఆయన వివరించారు. 2021 జనాభా లెక్కల్లో.. ఇలా చేస్తున్న తప్పులు సరిదిద్ది.. అర్హులైన వారికి మాత్రమే రిజర్వేషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకుని..  ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని లేఖ ద్వారా  విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: