కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తిరుమల కొండపైనా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో మాత్రమే రద్దు చేసే ఆర్జిత సేవలను... కోవిడ్ కారణంగా మార్చి 15 నుంచి నిరవధికంగా రద్దు చేసింది టీటీడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో జూన్ 8 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నా... స్వామివారి ఆర్జిత సేవలను పునరుద్దరించలేదు. నిత్య కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది.

ఆగష్టు 7వ తేది నుంచి ఆన్ లైన్ ద్వారా భక్తులు కళ్యాణోత్సవం సేవలో పాల్గొంటున్నారు. ఆన్ లైన్ కల్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారి ప్రసాదమైన అక్షింతలు, రవిక, కండువాను పోస్ట్  ద్వారా పంపిస్తోంది. మొదట్లో కల్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులను శ్రీవారి మూలవిరాట్టు దర్శనానికి అనుమతించని టీటీడీ... భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నించింది. కల్యాణోత్సవ సేవ టిక్కెట్టు పొందిన భక్తులు.. 90రోజుల లోపు స్వామి వారిని దర్శించుకున్నే అవకాశం కల్పించింది. దీంతో ఆన్ లైన్ కల్యాణోత్సవ సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది

భక్తుల విజ్ఞప్తితో , నవంబర్ ఒకటి నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికీ జరిగే ఆర్జిత సేవలను పునరుద్దరించాలని టీటీడీ నిర్ణయించింది. ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, స‌హ‌స్రదీపాలంకార‌ సేవ‌ల‌ను వర్చ్యువల్ విధానంలో నిర్వహించాలని  నిర్ణయించింది టీటీడీ.ఈ సేవల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు.. ఆ టికెట్టుపై శ్రీ‌వారి ద‌ర్శనం ఉండ‌దు. దర్శనం కోసం ప్రత్యేక‌ ద‌ర్శన టికెట్లు ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది. నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచే కల్యాణోత్సవ సేవా టిక్కెట్ల సంఖ్యను రెండు వేలకు పెంచింది.

రోనా క్లిష్టకాలంలోనూ ఆఏడుకొండల వాడి దర్శనంతో పునీతమయ్యే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి సేవలను ఇప్పుడు ఇంటినుంచే వీక్షించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: