వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆచంట మండలం కరుగోరుమిల్లి లో ప్రేమ పేరుతో ఓ వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. మూడేళ్లుగా యువతి పై రఘురాం అనే యువకుడు ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేకాదు మూడేళ్లలో నాలుగు సార్లు గర్బ స్రావం చేయించాడు. ఈ పాపానికి అతన్ని అతని కుటుంబ సభ్యులు అయిన కన్న తండ్రి, అన్న ఎంకరేజ్ చేశారని బాధితురాలు అన్నారు.
కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే తనని పూర్తిగా వాడుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.. ఇలా మరో సారి జరిగితే నా ప్రాణానికే ప్రమాదం అని ఆమె చెప్పినా వినలేదని అవేదన వ్యక్తం చేసింది.. ఇంక ఆలస్యం వద్దు వెంటనే పెళ్లి చేసుకుందామా అని అడిగితే మొహం చాటేశాడు అని గగ్గోలు పెట్టింది. ఈ విషయం బయటకు వస్తే చంపేస్తామని యువతి కుటుంబాన్ని బెదిరించారు. దీంతో వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు వివరాల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు..