ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యం లో మాస్కు పెట్టుకోవడం తప్పని సరిగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలని అధికారులు కూడా అవగాహన చర్యలు చేపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మాస్క్  పెట్టు కోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ కరోనా  వైరస్ వ్యాప్తికి కారకులుగా మారి పోతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కు పెట్టుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న వారికి ఎవరైనా మాస్కు పెట్టుకోమని సూచిస్తే మాత్రం దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు కూడా ఎన్నో తెర మీదికి వచ్చాయి.



 ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా మాస్కు పెట్టుకోమని చెప్పినందుకు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి ప్రాణం తీయ బోయారు ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఘటన తో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు,  ఈ ఘటన అమెరికాలోని చికాగో నగరంలో చోటు చేసుకుంది.  ఇద్దరు అక్కాచెల్లెళ్లు  ఒక సెక్యూరిటీ గార్డ్ ని    అత్యంత దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచారు. అయితే ఇందుకు గల కారణం తెలిసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. సెక్యూరిటీ కార్డు అక్కాచెల్లెళ్లకు మాస్కు పెట్టుకోవాలి అంటూ సూచించాడు.



 దీంతో సెక్యూరిటీ గార్డ్ ఊహించని విధంగా ఆగ్రహంతో ఊగిపోయిన అక్కా చెల్లెలు ఏకంగా తమ దగ్గర ఉన్న పదునైన కత్తితో సెక్యూరిటీ గార్డు పై విచక్షణారహితంగా దాడికి దిగారు. 27 సార్లు పొడిచారు ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక కత్తి దాడిలో గాయపడిన సెక్యూరిటీ గార్డు చికిత్స అందించేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాస్కు పెట్టుకోమన్నందుకు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం దీనిపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: