ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నానిది ఎప్పటికి కూడా ప్రత్యేక శైలి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా కూడా విజయవాడలో అండగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో చంద్రబాబునాయుడు ఆయనకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు అన్ని విధాలుగా న్యాయం చేశారు.

మళ్లీ రెండోసారి ఆయనకు విజయవాడ ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా సరే ఆయన మాత్రం విజయవాడ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో అసహనంగా ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయవర్గాల్లో వినబడుతున్నాయి. ప్రధానంగా కొంత మంది నేతలతో ఆయన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఒక మాజీ మంత్రి ఆయనను విజయవాడలో ఇబ్బంది పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారని దీనితో విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కష్టాలు పడుతున్న సమయంలో కూడా కేసినేని నాని ని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న రాజకీయం పై తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. దీనితో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఇటీవల వీరిద్దరి మధ్య పంచాయతీకి కూడా చేసే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం మాజీ మంత్రికి కాస్త సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనితో మాజీ మంత్రి కూడా కాస్త సైలెంట్ అయ్యారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: