రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నివేదిక ప్రకారం బంగారం పై రుణాలిస్తున్న బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్వహణ లో ఉన్న ఆస్తులు 15-18 శాతం వృద్ధి సాధిస్తాయని  చెప్పడం జరిగింది.  గోల్డ్‌ లోన్ల డిమాండ్‌ కి  ఇదే కారణమని వెల్లడించింది. లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో బంగారంపై రుణాలు అధికమవుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా తక్కువ పంపిణీతో ఏప్రిల్‌-జూన్‌ కాలంలో బంగారం పై రుణాల వృద్ధి స్థిరంగా ఉంది అని నివేదిక ద్వారా తెలిసింది.  

 వ్యాపారాలని తిరిగి  ప్రారంభించేందుకు కావాల్సిన మూలధనం కోసం ఈ రుణాలను తీసుకుంటున్నట్టు తెలుసుతోంది. రుణాల విషయంలో ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు పూచీకత్తు నిబంధనలు కఠినం చేసిన సంగతి కూడా తెలిసినదే. దీని మూలం గానే  వినియోగదార్లు గోల్డ్‌ లోన్లను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. గోల్డ్‌ లోన్లు పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ క్రిష్ణన్‌ సీతారామన్‌ వెల్లడించారు. అంతే కాదు పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. దీంతో ఎంఎస్‌ఎంఈలకు కొత్త రుణాలు, తనఖా రహిత రుణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చాలామటుకు తిరిగి  వసూళ్లు చేయలేక పోతున్నాయని, వీటికి రాని బాకీలు అధికమవుతాయని అని ఆయన చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తిరిగి తనఖా పెట్టి తీసుకున్న గోల్డ్‌ లోన్ల తో సహా బంగారం పై రుణాల పంపిణీ ఎక్కువైంది. సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా  రెండింతలకు పైగా అధికమైంది. చూసారా ఎంత శాతం పెరిగిందో. చాలా లోన్లు తక్కువ నిడివి ఉండడం, ముందస్తుగా చెల్లించే వెసులుబాటు, రిబేట్ల మూలంగా ఎన్‌బీఎఫ్‌సీలు అనుకూలమైన ఎంపిక అని వివరించింది. ఇది ఇలా ఉండగా  12 నెలల కాలానికి తీసుకున్న రుణంలో 60-65 శాతం మొత్తాన్ని కస్టమర్లు ఆరు నెలల్లోనే తిరిగి చెల్లిస్తున్నారని క్రిసిల్‌ తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: