తొమ్మిది మాసాలు మోసి జీవం పోసి..భూమ్మీదకు తీసుకొస్తుంది కన్న తల్లి...బిడ్డకు ఊహ తెలిసే వరకూ ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.. తర్వాత విద్యా బుద్దులను, ప్రపంచాన్ని చూపించాల్సింది మాత్రం తండ్రి. పెళ్లి చేసేంతవరకు బిడ్డ సంరక్షణ తండ్రి చూసుకోవాలి.. ఇకపోతే ఇప్పుడు బిడ్డలకు ఎక్కడ పెళ్లి చేయాలో అని కొందరి వారిపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడితే, మరికొందరు మాత్రం హత్య చేసి చేతులు దులుపుకుంటున్నారు.. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.. ఓ తండ్రి తన బిడ్డని అతి కిరాతకంగా హత్య చేశాడు. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు..



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం తెలంగాణ జగిత్యాల లో చోటు చేసుకుంది..జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపెల్లికి చెందిన ప్రేమలతకి గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన పోత్కూరి సత్యనారాయణ రెడ్డితో 28 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి కూతురు ఉంది. ఆమె వయసు 22 ఏళ్లు ఉంటుంది. కొద్ది కాలం బాగానే ఉన్న వీరిద్దరూ కలహాల వల్ల విడిపోయారు. అమ్మ దగ్గరే కూతురు పెరిగింది.విడాకుల అనంతరం సత్యనారాయణ రెడ్డి లతను రెండో వివాహం చేసుకున్నాడు. మౌనశ్రీ అప్పుడప్పుడూ తండ్రి వద్దకు వచ్చి వెళ్తుండేది. విడాకుల సమయంలో కూతురి పెళ్లి తండ్రి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు



ఊరిలో ఉన్న పొలాన్ని అమ్మగా అతనికి 16 లక్షలు వచ్చాయి..కూతురి పేరు పై పెట్టాలని ప్రేమ లత బంధువులు కోరారు..అది ఇష్టం లేని అతను అమ్మాయి అడ్డును తొలగించుకోవాలని అనుకున్నాడు. అమ్మాయిని రమ్మని పిలిచాడు.. అలా వచ్చిన అమ్మాయిని రెండో భార్య లత, బావమరిది రాజుతో కలసి కూతురిని కిరాతకంగా చంపేశాడు. పెళ్లి చేయాల్సి వస్తుందని మెడకు ఉరి బిగించి హత్య చేశారు. మౌనశ్రీ తల్లి ప్రేమలత ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.. హత్య వాళ్ళే చేశారని రుజువు కావడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. సవతి తల్లి , ఆమె సోదరుడికి 12 వేలు జరిమానా విధించింది. అతనికి జీవిత ఖైదును చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: