ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని ఈరోజు ఉదయం మందుపాతర పేలుడు జరిగింది ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ముస్లిం దేశమైన ఆప్ఘనిస్థాన్ లో ఈ నెల 23 నుంచి 27వతేదీ వరకు కేవలం ఐదు రోజుల్లో వరుసగా రోజు తప్పించి రోజు పేలుళ్లు సంభవిస్తూనే ఉన్నాయి దాదాపు ఈ వారంలో జరిగిన జరిగిన ఐదు పేలుళ్లలో 58 మంది మరణించగా, మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు.. అంతేగాక కాబూల్, ఖోస్ట్ లలో జరిగిన పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా, మరో 77 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం నాడు జరిగిన మరో పేలుడులో ఐదుగురు పౌరులు మరణించగా, 33 మంది గాయపడ్డారు.
అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరిగిన పేలుళ్లలో 58 మంది మరణించగా అందులో 30 మంది పిల్లలే ఉన్నట్లు మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. అయితే ఆప్ఘనిస్థాన్ దేశంలో పేలుళ్లకు పాల్పడుతూ మానవ హక్కులను నాశనం చేస్తున్నారని . ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు కారణమని తేలింది.