రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు  చేస్తోంది అసలు మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది అని అర్థమవుతుంది. మానవ సంబంధాలకు విలువ ఇవ్వకుండా క్షణకాల సుఖం కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు మనుషులు. దీంతో  రోజు రోజుకు తన మీదకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటీవలే ఏకంగా తల్లి తన ప్రియుడికి  కూతురునిచ్చి పెళ్లి చేసింది. కానీ తర్వాత  ప్రియుని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. అల్లుడుని చంపితే శిక్ష పడుతుంది అని తెలిసినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ఏకంగా అల్లుడిని కిరాతకంగా అంతమొందించింది ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.


 స్థానికంగా ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ఏరియా కెసిఆర్ నగర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసు విచారణలో ఎన్నో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చే అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. కేసీఆర్ నగర్ కు చెందిన ఓ మహిళా  తన కూతురితో  కలిసి ఉంటుంది. ఇక సదరు మహిళకు  అదే ప్రాంతానికి చెందిన నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ప్రియుని విడిచి ఉండ లేక పోయినా మహిళా  నీచానికి ఒడిగట్టింది.



 ఏకంగా తన కన్న కూతురునే ప్రియుడికి  ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఆ తర్వాత అటు కూతురుని ఇటు తనను  కూడా అల్లుడు సుఖపెడతాడు అని అనుకుంది కానీ పెళ్ళయిన కొన్ని రోజులకే కూతురుని హింసించడం మొదలుపెట్టాడు అల్లుడు. ఇక అంతే కాకుండా తల్లికి తన భర్తతో అక్రమ సంబంధం ఉంది అన్న విషయం కూడా యువతికి తెలిసిపోయింది. ఈ క్రమంలోనే మానసికంగా కుంగిపోయిన సదరు యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఇక కూతురు చనిపోయినప్పటికీ కూడా సదరు వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగింది తల్లి. ఇక చివరికి ప్రియున్ని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చింది సదరు మహిళ. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరపగా ఎన్నో విషయాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: