మనసా వాచా కర్మణ మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణంగా హత్య చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి మండలం కట్టేవారి పాలానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి గాయత్రి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి దిలీప్ భార్యను అనుమానిస్తూ వచ్చాడు. భార్య తనకు తెలియకుండా పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది అని అనుమానిస్తూ గొడవలు పడుతూ ఉండేవాడు.
దీంతో రోజురోజుకు దిలీప్ లో అనుమానం పెరిగి పోయింది. ఇక ఓ రోజు భార్యతో ఇదే విషయంపై గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పోయింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడై గా మారిపోయిన దిలీప్ ఘాతుకానికి తెగబడ్డారు. అమానుషంగా భార్య గొంతు నులిమి చంపేశాడు. ఇక అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు భర్త. ఇక స్థానికులు వెంటనే గమనించి గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.