బెట్టింగ్‌ మాఫియా కన్ను పట్టణాలు, పల్లెలపై పడింది. మెట్రో నగరాల్లో వీరి కార్యకలాపాలకు అక్కడ పోలీసు యంత్రాంగం చెక్‌ పెడుతుండటంతో ఇటువైపు దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఆన్లైన్ ద్వారా బుక్కీలు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం, రాజాంలో బయటపడిన బెట్టింగ్‌ బాగోతాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ యువతలో క్రికెట్‌ మోజును బలహీనతగా చేసుకున్న ఓ ముఠా ప్రత్యేక యాప్‌ ద్వారా బెట్టింగ్‌ రొంపిలోకి దించుతోంది.

ఒక సినిమా థియేటర్ వెనుక భాగంలో దందా సాగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారిలో 11మందిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల డబ్బు స్వాధీనం చేసుకున్నారు.ఇంతకముందు బెట్టింగ్ మాఫియా దొరికిపోతే నగదు రేపేనా కొంత సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకునే వారు కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అవ్వడం వల్ల  డబ్బులు తక్కువగా మొబైల్స్, లాప్ టాప్స్  ఎక్కువగా దొరుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: