అశోక్ గజపతిరాజును కలిసి సహకరించాలని కోరినా స్పందించలేదన్నారు ఊర్మిళ. ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ప్రమాణ స్వీకారం జరగనివ్వడం లేదని.. తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే ప్రశ్నిస్తున్నామని.. ఎలాంటి రాజకీయాలు లేవు అన్నారు. మాన్సాస్పై చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని.. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు. మాన్సాస్లో జరుగుతున్న పరిణామాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈవిధంగా ఊర్మిళ, సంచయితల మధ్య మరింతగా వివాదం ముదురుతోంది. ఇక అంతకు ముందే విజయనగరం ఎంఆర్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయంపై కూడా ఊర్మిళ గజపతి మండిపడిన సంగతి తెలిసిందే.
అశోక్ గజపతిరాజును కలిసి సహకరించాలని కోరినా స్పందించలేదన్నారు ఊర్మిళ. ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ప్రమాణ స్వీకారం జరగనివ్వడం లేదని.. తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే ప్రశ్నిస్తున్నామని.. ఎలాంటి రాజకీయాలు లేవు అన్నారు. మాన్సాస్పై చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని.. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు. మాన్సాస్లో జరుగుతున్న పరిణామాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈవిధంగా ఊర్మిళ, సంచయితల మధ్య మరింతగా వివాదం ముదురుతోంది. ఇక అంతకు ముందే విజయనగరం ఎంఆర్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయంపై కూడా ఊర్మిళ గజపతి మండిపడిన సంగతి తెలిసిందే.