క్షణికావేశంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిని కడుతెరుస్తున్నారు కొందరు వ్యక్తులు. ఆ తర్వాత ఎంత బాధ పడినా.. జరిగిపోయిన వాటిని ఆపలేక కారాగారాల్లో దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. కొద్ది సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ఆగస్టు నెలలో పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలపాటు తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. కానీ ఇటీవల వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తన భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగి పోయాడు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఇండోర్‌లోని సన్యోగితాగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జవరా కాంపౌండ్ లో ఈ ఘటన జరిగింది.  కుటుంబ వివాదం కారణంగా భర్త తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పొడిచి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం, చిన్న వాగ్వాదం కారణంగా భర్త గొలుసుతో తన భార్య మెడ చుట్టూ బిగించి హత్య చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ భార్య చాకచక్యంగా తప్పించుకోగలిగారు. కానీ అప్పటికీ ఆమె వెంట పడుతూ వంటగది నుండి కత్తిని తెచ్చి తన 22 ఏళ్ల భార్యను కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు స్వయంగా సన్యోగితాగంజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.  అన్షు కుటుంబం మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డ భర్త, అత్తమామలపై ఆరోపణలు చేశారు. ఐతే బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


కలిండి గోల్డ్‌లో నివసించే అన్షు.. పెళ్లికి ఒక నెల ముందు వరకు తన భర్త హర్ష శర్మతో కలిసి పని చేస్తుండేది. ఒకే కంపెనీలో పని చేస్తుండడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆగస్టు నెలలో ఈ ప్రేమ పక్షులు ఇద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అనంతరం అన్షు జవరా కాంపౌండ్‌లో ఉన్న హర్ష్ శర్మ ఇంట్లో నివసించడం ప్రారంభించింది. కానీ కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు. ఆమె మృతదేహాన్ని సన్యోగితాగంజ్ పోలీసులు ఎం.వై. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. నిందితుడిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: