పోలవరం కూడా పక్కన పెడితే ఏలా ? పోలవరం ప్రాజెక్టు విషయం లో పార్లమెంట్ లో చేసిన చట్టం అమలు చేయాల్సిందే అని అన్నారు. కేంద్రం చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు పనుల్లో 2014 రేట్లు 2018 లో ఉంటాయా ? అని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన జగన్ పోలవరం పై మోదీ ని ఎందుకు నిలదీయడం లేదు ? అని ఆయన ప్రశ్నించారు. కేసులు ఉండటం వల్లే మోదీ ని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారం జనంలో ఉంది అని ఆయన అన్నారు.
జగన్ ను మోదీ జైలులో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని అన్నారు. జగన్ ను జైలులో వేయటం అంత సులువా ? అని ఆయన నిలదీశారు. కేసులు నుంచి బయటపడేందుకు జగన్ మౌనం గా ఉంటే ప్రజలు క్షమించరన్నారు. 51 శాతం ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలు జగన్ ధైర్యంగా మాట్లాడతారని భావించారని ఆయన పేర్కొన్నారు. జగన్ కు ధైర్యం ఏమైందని ప్రశ్నించారు. కేవీపీ కోర్టు లో వేసిన పిటిషన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. మీరు మోదీ కి లొంగిపోయారనుకోవాలా ? ఎందుకు లొంగిపోవాలి అని ప్రశ్నించారు.