భారత దౌత్య పరంగా వ్యూహాత్మ కంగా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు అయోమయంగా మారిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఏ చిన్న తోక జోడింపు చర్యకు పాల్పడిన అంతకు మించి అనే విధంగా చావుదెబ్బ కొడుతుంది భారత్ . భారత్ పై దాడి చేయాలి అనే ఆలోచన వస్తేనే పాకిస్తాన్ వనికి పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మొన్నటివరకు పాకిస్తాన్ కి సహాయం చేస్తూ ఉన్న మరికొన్ని దేశాలు కూడా పాకిస్తాన్ ను పూర్తిగా నిషేధించే విధంగా ప్రస్తుతం వ్యూహాత్మకంగా దౌత్య పరంగా ముందుకు వెళ్తుంది భారత్.
ఈ క్రమంలోనే ఏకంగా పాకిస్తాన్ మిత్ర దేశాల ఇరాన్ సౌదీ దేశాలు పాకిస్తాన్ కి భారీ షాక్ ఇచ్చాయి . ప్రస్తుతం ఇరాన్ సౌదీ అరేబియా దేశాలు భారత్ కు మిత్ర దేశాల కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత దేశానికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమాన్ని కూడా అనుమతించే ప్రసక్తే లేదు అంటూ ఇరాన్ సౌదీ అరేబియా దేశాలు స్పష్టం చేశాయి. ఇది ఒక రకంగా భారతదేశ దౌత్యపరమైన విజయమని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. పాక్ అసమర్థత అని కూడా చెబుతున్నారు విశ్లేషకులు.