ఇక లాక్డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ధరలను ఒక్కసారిగా పెంచి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే... అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ పద్ధతుల్లో మద్యం రాకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది ఏకంగా శానిటైజర్లు తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారట. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలోని మందు బాంబులు ఎనలేని ఆనందాన్ని పొందుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక లాక్డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ధరలను ఒక్కసారిగా పెంచి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే... అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ పద్ధతుల్లో మద్యం రాకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది ఏకంగా శానిటైజర్లు తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారట. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలోని మందు బాంబులు ఎనలేని ఆనందాన్ని పొందుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.