ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కార్ మందు బాబులకు శుభవార్త చెప్పింది.. మద్యం ధరల్ని తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మీడియం, ప్రీమియం స్థాయి ధరలలో 25 శాతం వరకు ధరలు తగ్గాయి. రూ.250 - 300 వరకు ఉన్న మద్యం ధరపై రూ.50 తగ్గించిన ప్రభుత్వం. ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్‌తో పాటూ విదేశీ మద్యం ధరలు కూడా తగ్గించారు. రూ.50 నుంచి రూ.1350 వరకూ వివిధ కేటగిరీల్లో ఈ మద్యం ధరలు తగ్గాయి. రేపటి నుంచి ఈ తగ్గించిన మద్యం ధరలు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.. బీరు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లోనూ అలాగే రూ.200 క్వార్టర్ బాటిల్ ధరలపై మాత్రం మార్పులు లేవు. గత నెల సెప్టెంబర్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మద్యం ధరల్ని తగ్గించిందనే విషయం తెలిసిందే.

ఇక లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ధరలను ఒక్కసారిగా పెంచి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే... అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ పద్ధతుల్లో మద్యం రాకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది ఏకంగా శానిటైజర్లు తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్‌‌ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారట. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలోని మందు బాంబులు ఎనలేని ఆనందాన్ని పొందుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: